బెంగాల్ ప్రభుత్వం కరోనాపై వాస్తవాలు చూపించడం లేదు: కేంద్ర మంత్రి

X
By - TV5 Telugu |2 May 2020 12:53 AM IST
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ ప్రభుత్వం కరోనాపై వాస్తవాలను బయటపెట్టడం లేదని అన్నారు. కరోనాపై పోరాటం చేయాల్సిన ప్రభుత్వం.. వాస్తవాలను దాచిపెట్టడంపై దృష్టి పెడుతుందని అన్నారు. ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని ఆయన అన్నారు.
మరోవైపు ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం కరోనాపై పోరాడుతుంటే.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని అన్నారని ఆరోపించారు. సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయరాదని.. కలిసి కట్టుగా కరోనాపై యుద్ధం చేయాలని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలోని ప్రతి ఒక్కరూ కోవిడ్పై పోరాడుతున్నారని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com