లాక్ డౌన్ పొడిగింపుతో పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం

X
By - TV5 Telugu |3 May 2020 12:39 AM IST
కరోనా కట్టడికి కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించడంతో పౌరవిమానయాన శాఖ నుంచి కీలక ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా మే 17 వరకూ దేశీయ, అంతర్జాతీయ విమానసేవలను నిలిపివేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు డీసీసీఏ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గకపోవడంతో. కేంద్రం రెండు వారలు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం బట్టి మొత్తం 3 జోన్లు గా విభజించి.. ఆయా ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై రాష్ట్రాలకి మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com