తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత
By - TV5 Telugu |3 May 2020 3:40 PM GMT
తెలంగాణ-ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్తున్న వలస కూలీలను ఆంధ్రా పోలీసులు అనుమతించడంలేదు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఏపీ వలస కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. రాత్రి నుంచి సరిహద్దులోనే ఉండిపోవడంతో తెలంగాణ పోలీసులు వారికి అల్పాహారం, భోజనం అందజేశారు. ప్రభుత్వం, పోలీసులు ఎందుకు తమను పట్టించుకోవడం లేదో ఆర్డమే కావటం లేదని అంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com