ఏపీలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి
By - TV5 Telugu |5 May 2020 1:27 PM GMT
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. రాష్ట్రంలో ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. దీంతో ఏపీలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా విలయతాండవానికి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,717కు చేరింది. ఈ వైరస్ నుంచి 589 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com