ఏపీలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |8 May 2020 8:00 PM IST
ఆంధ్రప్రదేశ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరింది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనా బారిన పడి 41 మంది మృతి చెందారు. ప్రాణంతకర వైరస్ నుంచి కోలుకొని 842 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com