భారత్‌లో ఒక్కరోజే కరోనాతో 103 మంది మృతి

భారత్‌లో ఒక్కరోజే కరోనాతో 103 మంది మృతి
X

భారత్‌లో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడి 103 ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 1886కు చేరింది. దేశవ్యాప్తంగా కొత్తగా 3,390 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు భారత్‌లో 56,342 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌ నుంచి 16539 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 17,974 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అక్కడ కరోనాతో 694 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 7,103 కాగా ఢిల్లీలో 5,980 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో 5,409 కేసులు, రాజస్థాన్‌లో 3,453 పాజిటివ్ కేసులు, మధ్యప్రదేశ్‌లో 3,252, ఉత్తరప్రదేశ్‌లో 3,071, పంజాబ్‌లో 1,644, వెస్ట్‌ బెంగాల్‌లో 1,548, పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1,833 కరోనా కేసులు నమోదవ్వగా, తెలంగాణలో 1,122 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story