కూత పెట్టనున్న కోలీవుడ్

తమిళనాడు ప్రభుత్వం కోలీవుడ్కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిబంధనలతో పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకునేందుకు అనుమతిచ్చింది. లాక్డౌన్ వలన సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయిందని.. చాల సినిమాలు పోస్టు ప్రొడక్షన్ దశలో ఆగిపోయాయని.. వాటికీ అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళ నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిం చిన విషయం తెలిసిందే. నిర్మాతల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. సినిమా, బుల్లితెరకు సంబంధించిన పోస్టుప్రొడక్షన్ పనులను ఈ నెల 11 నుంచి ప్రారంభించు కోవచ్చని శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. అయితే భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం తదితర కరోనా నిరోధక నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com