విశాఖ ఘటనలో బాధితులను పరామర్శించిన టీడీపీ నేతలు
By - TV5 Telugu |9 May 2020 5:43 PM GMT
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని టీడీపీ నాయకులు పరామర్శించారు. కేజీహెచ్ ఆస్పత్రికి వెళ్లిన టీడీపీ నేతలు.. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. సంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిహారం విషయంలో సీఎం చెబుతున్న మాటలు అనుమానాన్ని కలిగిస్తున్నాయని.. వెంటనే ఈ ప్రమాదకర పరిశ్రమను ఇక్కడి నుంచి తొలగిస్తామని సీఎం ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com