తెలంగాణలో కొత్తగా 47 కరోనా కేసులు

X
By - TV5 Telugu |15 May 2020 4:53 AM IST
తెలంగాణలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 939 మంది కోలుకోగా.. 428 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, ఇప్పటివరకూ 34 మంది మరణించారు. ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 40 మందికి, రంగారెడ్డిలో ఐదుగురికి, మరో ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com