ఆంధ్రప్రదేశ్‌లో మరింత పెరిగిన కరోనా కేసుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో మరింత పెరిగిన కరోనా కేసుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడచిన 24 గంటల్లో 57 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2157 కు చేరింది. ఇప్పటివరకు 1257 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా కారణంగా ఇప్పటివరకు 48 మంది వ్యాధి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 857 మంది చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. చిత్తూరులో అత్యధికంగా 13 నమోదయ్యాయి. నెల్లూరులో 8, కర్నూలులో 5, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇక తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చిన వారిలో 28 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story