ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాన్ని టాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరంతా మిర్చి పనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన వారంతా మాచవరానికి చెందిన వారు కావటంతో.. ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story