పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మే31 వరకు కర్ఫ్యూ

X
కరోనా నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మూడో దశ అమలులో ఉంది. మే 17తో లాక్ డౌన్ ముగుస్తుంది. దీంతో లాక్ డౌన్ పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉంది. అయితే, ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటిచగా.. మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలు కూడా అదే బాటలో నిర్ణయం తీసుకున్నాయి. అయితే, తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటిస్తే.. పంజాబ్ మాత్రం మే31 వరకూ క్ఫ్యూ కొనసాగుతోందని ప్రకటించారు. ప్రజా రవాణా చాలా వరకూ పునరుద్దరిస్తామని.. చాలా ప్రాంతాలలో పలు సడలింపులు ఇస్తామని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
