జగన్ నిర్ణయాల వల్ల ఏపీ 50 ఏళ్లు వెనక్కు పోతుంది: బీజేపీ

X
By - TV5 Telugu |19 May 2020 9:48 PM IST
ప్రజాగ్రహాన్ని చవిచూడకముందే.. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర నేత సైకం జయచంద్రారెడ్డి. తిరుపతిలోని తన నివాసంలో బీజేపీ, జనసేన పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. నిరసన దీక్ష చేపట్టారు. ఏపీ సీఎం చేతకాని నిర్ణయాల వల్ల ఏపీ అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఉన్న విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే తగ్గించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com