తమిళనాడులో వరుసగా మూడోరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు

X
By - TV5 Telugu |3 Jun 2020 4:50 AM IST
తమిళనాడుతో కరోనా కలకలం రేపుతోంది. గత మూడురోజుల నుంచి వరుసగా వెయ్యికిపైగా నమోదవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 1,091 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,586కు చేరింది. అటు, గడిచిన 24 గంటల్లో 13మంది మృతిచెందగా.. ఇప్పటివరకూ కరోనా కారణంగా మొత్తం 199మంది మరణించారు. అటు, మంగళవారం 536 మంది పూర్తిగా కోలుకుని ఇప్పటివరకూ 13,706 మంది కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ 10,681 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఆశాజనకంగా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

