ప్రభుత్వ ఉద్యోగులు పాటించాల్సినవి ఇవే.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలలోని సిబ్బందికి కరోనా పాజిటివ్ రావటంతో మిగిలిన వారు ఆఫీసులు రావడానికి భయడుతున్నారు.
కొత్త మార్గదర్శకాలు
* దీంతో కేంద్రం కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది.
* దగ్గు, జలుబు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు ఉన్నవారు ఆఫీలులకు రాకూడదు.
* సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు ఆఫీసులు రావాలి
* కట్టడి ప్రాంతాల ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలి
* ఇంటర్కామ్ ఫోన్లలోనే ఉద్యోగులు మాట్లాడుకోవాలి
* ఆఫీసులో ఎవరి కంప్యూటర్ కీబోర్డులును వారే శానిటైజేషన్ చేసుకోవాలి
* వీడియో కాన్ఫరెన్స్ లోనే సమావేశాలు నిర్వహించుకోవాలి
* ఉద్యోగులు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవద్దు అని కొత్త మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com