ఏడాదిలో రేట్లు పెంచి పేదవాడి నడ్డి విరిచారు: టీడీపీ ఎమ్మెల్యే

X
జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలనలో 80వేల కోట్ల అప్పు తప్ప రాష్ట్రంలో అభివృద్ది శూన్యం అని విమర్శించారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. వైసీపి పాలనపై ఆయన పాలకొల్లులో ప్రజా ఛార్జీ షీట్ విడుదల చేశారు. వైసీపీ ఏడాది పాలనలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వివక్షత పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధంపై చిత్తశుద్ది ఉంటే గుజరాత్, బీహార్ లాగానే సంపూర్ణ మద్య నిషేధం చేసి ఉండాలన్నారు. ఇసుక, సిమెంట్, కరెంట్ రేట్లను పెంచి పేదవాడి నడ్డి విరిచారని ఎద్దేవా చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
