రాజధానిని మూడు ముక్కలు చేస్తే.. చూస్తూ ఊరుకోం: సీపీఐ రామకృష్ణ

X
By - TV5 Telugu |15 Jun 2020 12:56 AM IST
రాజధానిని మూడు ముక్కలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. పోరాటాలను ఉధృతం చేస్తామని.. ముఖ్యమంత్రి జగన్ రాజధానిని విశాఖపట్నం తరలించి పాలన ఎలా సాగిస్తారో చూస్తామని ఆయన అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 180 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా అఖిలపక్ష పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో నిరాహార దీక్షలను రామకృష్ణ ప్రారంభించారు. ప్రభుత్వం పోరాటాన్ని అణిచివేయాలని చూసినా రైతులు దీక్ష ఆపకలేదని.. అందుకు రైతులకు జేజేలు అన్నారు. రాజధానిని మార్చుతానని జగన్ తన పాదయాత్రలో ఎక్కడా చెప్పలేదన్నారు. 9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ఇప్పుడు ఎలా మారుస్తారని రామకృష్ణ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com