వైసీపీ నేతలను మరోసారి తీవ్రంగా విమర్శించిన రఘురామకృష్ణంరాజు

X
By - TV5 Telugu |17 Jun 2020 2:05 AM IST
వైసీపీ నేతలు తనపై విమర్శలు చేయడంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. మంత్రి పేర్నినానితో పాటు ఇతరులు తనపై ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. సింహమే సింగిల్గా వస్తుందని, పందులే గుంపులా వస్తాయంటూ వైసీపీ నేతల్ని విమర్శించారు. కొట్టు సత్యనారాయణ ఓ ఇసుక దొంగ అంటూ ఆరోపించారు. ఇళ్లస్థలాలతో పాటు ఇసుక అక్రమాలకు పాల్పడ్డాంటూ మండిపడ్డారు. అతనితో పాటు నాగేశ్వరరావు సైతం తనపై విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. ఇళ్లస్థలాల అక్రమాల్లో వీరి పాత్ర ఉందన్నారాయన. ఈ దొంగలంతా కలిసి ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com