నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు ప్రభుత్వం పాటించాలి: విష్ణువర్ధన్ రెడ్డి
By - TV5 Telugu |18 Jun 2020 6:19 PM GMT
శాసనమండలిలో జరిగిన పరిణామాలు చూస్తుంటే.. తప్పంతా ప్రభుత్వం వైపే వున్నట్టే భావించాల్సి వస్తోందని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. మండలిలో జరిగిన గొడవకు సంబంధించిన ఫుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో వున్న అంశాలపై జోక్యం చేసుకోవడం తగదన్న ఆయన.. రాజధాని ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇంకా నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాల్సిందేనని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com