చైనా, భారత్ వివాదంపై ట్రంప్ వ్యాఖ్యలు
By - TV5 Telugu |21 Jun 2020 4:45 PM GMT
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే, అమెరికా అద్యక్షడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరుదేశాలతో మాట్లాడుతున్నాని అన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఘర్షణ చాలా క్లిష్టమైనదని అన్నారు. ఈ సమస్య పరిస్కారానికి తన వంతు తాను కృషి చేస్తానని.. అయితే, ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. అమెరిక అద్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ మేరకు సమాధానం చెప్పారు. కాగా, తూర్పు లడ్డాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంట చైనా బలగాలకు దురాక్రమణకు పాల్పడిన క్రమంలో ఇరుదేశాల సైనికులు పరస్పరం దాడి చేసుకొని పలువురు చనిపోయిన విషయం తెలిసిందే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com