కరోనా పాండమిక్ ముగిసేదాకా వారికి నో-ఎంట్రీ

X
By - TV5 Telugu |24 Jun 2020 10:43 PM IST
విదేశాల్లో ఉంటున్న సౌదీ రెసిడెంట్స్ కరోనా పాండమిక్ ముగిసేదాకా సౌదీ అరేబియాలో అడుగు పెట్టేందుకు వీలు లేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సౌదీ పాస్పోర్ట్స్ (జవాజత్) స్పష్టం చేసింది. ఓ రెసిడెంట్ సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నకు ట్విట్టర్ ద్వారా పాస్పోర్ట్ అథారిటీ సమాధానమిచ్చింది. రెసిడెంట్స్కి సౌదీలో ప్రవేశానికి సంబంధించి ప్రకటన వెలువడుతుందనీ, వ్యాలీడ్ ఎంట్రీ వీసా ఉన్నవారికే ఇది వర్తిస్తుందని పేర్కొంది అథారిటీ. అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్కి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడతాయని అథారిటీ స్పష్టం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com