రోజుకు 600 మరణాలు.. అమెరికా అధికారిక లెక్కలు..

అగ్రరాజ్యం అమెరికాను వైరస్ మహమ్మారి ఇప్పట్లో వదిలేలాగ కనిపించట్లేదు. కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి కదా అనుకునేంత లోపు మళ్లీ పెరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. టెక్సాస్ తో పాటు మరి కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఈ వారం కొత్త కొవిడ్ కేసులను నమోదు చేశాయి. అధికారిక గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కువ అని తెలుస్తోంది. అరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో నమోదైన కేసులు పాత రికార్డులను బ్రేక్ చేశాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వాషింగ్టన్ డిసిలోని డిడబ్ల్యు కరస్పాండెంట్ స్టీఫన్ సైమన్స్ మాట్లాడుతూ 13 రాష్ట్రాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు.
టెక్సాస్ నగరం హ్యూస్టన్ కొత్త వైరస్ కేంద్రంగా మారుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. కాలిఫోర్నియాలో మహమ్మారి కారణంగా గవర్నర్ గావిన్ న్యూసోమ్ బడ్జెట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బుధవారం రాష్ట్రంలో 7,149 కొత్త కేసులు నమోదైతే, గురువారం నాటికి మరింత పెరిగి ఇంటెన్సివ్ కేర్ లోని 34% పడకలను కొవిడ్ కేసులకే వాడుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ఇప్పుడు 16.5 నుండి 26.4 మిలియన్ల మందికి సోకినట్లు అంచనా వేసింది - అంటే వాస్తవ గణాంకాలు ధృవీకరించబడిన 2.3 మిలియన్ల కేసుల కంటే సుమారు 10 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం, రోజుకు దేశవ్యాప్తంగా మరణాలు 600 వరకు ఉన్నాయి. ఈ సంఖ్య ఇన్ఫెక్షన్లను నివారించడానికి మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. వైరస్ ముఖ్యంగా ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరింత ప్రమాదకరమని నిరూపించబడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com