తెలంగాణలో కరోనా విలయతాండవం.. కొత్తగా 1087 కేసులు

తెలంగాణలో కరోనా విలయతాండవం.. కొత్తగా 1087 కేసులు

తెలంగాణలో కరోనా విలయతాండం చేస్తుంది. ఈ రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 1087 కేసులు నమోదవ్వటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 888 కేసులు జీహెచ్ఎంసీ పరిదిలోనే రావటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 13,436కి చేరింది. ఇప్పటి వరకూ 4928 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 8265 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఒక్కరోజే ఆరుగురు కరోనాతో మృతి చెందగా.. కరోనా కారణంగా ఇప్పటివరకూ 243 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Next Story