ఢిల్లీలో 80వేలు దాటిన కరోనా కేసులు

X
By - TV5 Telugu |28 Jun 2020 3:53 AM IST
ఢిల్లీ కరోనా మహమ్మారికి హాట్ స్పాట్ గా మారుతోంది. ప్రతీరోజు వేలల్లో కొత్త కరోనా కేసుల నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,948 మంది కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 80,188కి చేరింది. అయితే, ఢిల్లీలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కాస్తా ఉపసమనం అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 49,301మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 28,329మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 2,210మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీలో 2,558మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com