కరోనా చికిత్సలో డెక్సామెథాసోన్కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

X
By - TV5 Telugu |28 Jun 2020 2:51 AM IST
కరోనా చికిత్సలో డెక్సామెథాసోన్ను ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులకు మిథైల్ ప్రెడ్నిసోలోస్ కు బదులు ఈ డ్రగ్ వాడుకోవచ్చని తెలిపింది. కోవిడ్ రోగులకు ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుందని.. దీంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడగలదని.. యూకేలో నిర్వహించిన క్లినికల్ ట్రైల్స్ లో తేలింది. దీంతో భారత ప్రభుత్వం దీనికి అనుమతి ఇచ్చింది. పైగా ఇది చాలా చవకగా దొరికే డ్రగ్. ఈ డ్రగ్ ను ఊపిరితిర్తులకు సంబందించిన చికిత్సలో వాడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com