2000 వేల మంది బీఎస్ఎఫ్ సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్

2000 వేల మంది బీఎస్ఎఫ్ సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
X

దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. భారత్ రక్షణ దళాల్లో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును చేరుకోనుంది. కాగా, దేశ రక్షణలో ఉండే జవాన్ల మీద ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటి వరకు 2000 వేల మంది బీఎస్ఎఫ్ , సీఆర్పీఎఫ్ సిబ్బందిని కరోనా వైరస్ సోకినట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీఆర్పీఎఫ్ కు చెందిన 1,219 మంది, బీఎస్ఎఫ్ కు చెందిన 1018 మందిని కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించామని ప్రకటిచారు. వారికి మెరుగైన చికత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story