కరోనా మృతుల కోసం ప్రత్యేక శ్మశాన వాటిక ఏర్పాటు చేసిన ప్రభుత్వం

X
By - TV5 Telugu |4 July 2020 1:56 AM IST
బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 36 ఎకరాల స్థలంలో.. కర్నాటక ప్రభుత్వం స్మశాన వాటిక ఏర్పాటు చేసింది. అయితే, ఇది కరోనాతో మృతి చెందిన వారి కోసం కేటాయించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన వారిని బెంగళూరులోని స్మాశాన వాటికలో అంత్యక్రియలు చేస్తే.. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కరోనా మృతుల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. బెంగళూరు చుట్టు పక్కల మొత్తం 9 గ్రామాల్లో స్థలాలను సేకరించినట్టు సమాచారం. ఇక నగరంలోని పలు స్మాశాన వాటికల్లో కరోనా మృతులకు అంత్యక్రియల నగరంలో నిర్వహిచమని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com