కరోనా కట్టడికి బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం

X
By - TV5 Telugu |5 July 2020 12:43 AM IST
కరోనా కట్టడిలో భాగంగా బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిబంధనలు ఉల్లంఘించిన వారికి 50 రూపాయలు జరిమానా విధించింది. అయితే, ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించాలని.. రెండు మాస్కులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ లో ఇప్పటి వరకూ 11,460 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,211 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com