లుథియానా సెంట్రల్ జైలులో 26 మంది ఖైదీలకు కరోనా

X
By - TV5 Telugu |6 July 2020 12:31 AM IST
దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. పంజాబ్ లో రోజురోజుకి కేసులు పెగుతున్నాయి. తాజాగా, లుధియానాలోని సెంట్రల్ జైలులో 26 మంది ఖైదీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో జైలు అప్రమత్తమై.. కరోనా బాధితులను ప్రత్యేక బ్యారక్ లో ఉంచి ఇతర ఖైదీలను కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారితో కాంటాక్ట్ అయ్యేవారిని టెస్టింగ్ లు చేస్తున్నారు. వారికి కరోనా ఎలా సోకిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. పంజాబ్లో ఇప్పటి వరకు 6,109 కేసులు నమోదవ్వగా.. 162 మంది కరోనా కాటుకు బలయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com