బజాజ్ ఆటో ప్లాంట్ లో 400 కేసులు.. కరోనా భయంతో కార్మికులు..

మహమ్మారి కరోనా కార్మికుల పొట్ట కొడుతోంది. కరోనా కలకలంతో బజాజ్ ఆటో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్ లో కేసుల సంఖ్య 400 కి పెరిగింది. దీంతో కార్మికులు ప్లాంట్ కు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ను కొన్ని రోజులు మూసి ఉంచాలనే డిమాండ్ కొనసాగుతోంది.
కొవిడ్ కేసుల సంఖ్య పెరగడంతో ఓ వారం 10 రోజుల పాటు ప్లాంట్ లో పని నిలిపివేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ప్లాంట్ యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలని అంటున్నారు. అవసరమైతే నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు గంటలు పని చేయించుకోమని కోరినట్లు వర్కర్స్ యూనియన్ తెలిపింది. ఈ ప్లాంట్ లో 8,100 మందికి పైగా కార్మికులు పని చేస్తుంటారు. కోవిడ్ కారణంగా ఏడుగురు కార్మికులు మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com