7కి.మీ దూరం.. 8వేలు ట్రావెలింగ్ చార్జీలు.. షాకైన కరోనా పేషెంట్

X
By - TV5 Telugu |9 July 2020 10:38 PM IST
కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఆర్ధికంగా నష్టంపోయారు. అయితే, చాలా మంది కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక సమస్యలను పట్టించుకోకుండా.. శానిటైజర్లు, మాస్కులు భారీ రేట్లకు అమ్మి చాలా మంది సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా కరోనా పేషెంట్ నుంచి పెద్ద ఎత్తున సొమ్ము దండుకున్న అంబులెన్స్ నిర్వాహకుడిపై పోలీసులు కేసుల నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది. కరోనా బాధితుడిని కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రి వరకూ తరలించడానికి ఏకంగా 8000 రూపాయలు తీసుకున్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు విపత్తు నిర్వహణ చట్టం, మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com