కరోనాతో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం: బెంగాల్ సీఎం

X
By - TV5 Telugu |16 July 2020 1:41 AM IST
మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. కరోనాతో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందితే.. వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అన్నారు. అన్ని జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడిన సీఎం ఈ మేరకు ప్రకటించారు. కరోనా అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా విస్తరిస్తుందని.. ఎవరైనా కోవిడ్-19 వల్ల మృతి చెందితే వారి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటి వరకూ పశ్చిమబెంగాల్ లో 268 మంది పోలీసులకు 30 మంది డాక్టర్లకు 43 మంది నర్సులకు 62 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా బారినపడ్డారని మమతా బెనర్జీ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com