నాలుగు ఫ్లాట్లకు ఓనర్.. గుడిముందు బిచ్చమెత్తుకుని కోడలి చేతిలో..

నాలుగు ఫ్లాట్లకు ఓనర్.. గుడిముందు బిచ్చమెత్తుకుని కోడలి చేతిలో..
X

ముంబైలో నాలుగు ఫ్లాట్లకు ఓనర్.. అయినా గుడి ముందు బిచ్చమెత్తుకుని జీవనం సాగించింది. ఆస్తి కోసం కొడుకు భార్య ఆమెని అత్యంత దారుణంగా హతమార్చింది. ఆస్తి పట్ల వ్యామోహం మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. వెనుకా ముందూ ఆలోచించకుండా పగ ప్రతీకారాలతో మానవత్వాన్ని మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. కష్టపడకుండా వచ్చే డబ్బుకోసం కక్కుర్తిపడుతున్నారు. ముంబై చెంబూర్ లోన పెస్టం సాగర్ కాలనీలో నివసిస్తున్న 32 ఏళ్ల అంజన అనే మహిళ తన 70 ఏళ్ల అత్త సంజనను హతమార్చింది. హత్యానేరం తమపై రాకుండా ఉండాలని తీవ్రగాయాలతో ఉన్న ఆమెను రాజవాడి ఆసుపత్రికి తీసుకువచ్చారు. బాత్ రూములో జారి పడిపోయిందని చెప్పారు. కొట్టిన దెబ్బలుగా గుర్తించిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో సంజన దత్తపుత్రుడు దినేష్ అతడి భార్య అంజన కలిసి అత్త సంజనను హతమార్చినట్లు తెలుసుకున్నారు.

సంజన భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. వారికి పిల్లలు లేకపోవడంతో భర్త సోదరుడి కుమారుడు దినేష్ ను దత్తత తీసుకుంది. వారికి నాలుగు ఫ్లాట్లు.. రెండు చెంబూర్ లో రెండు వర్లిలో ఉన్నాయి. మూడు ఫ్లాట్లను అద్దెకిచ్చి ఒక ఇంట్లో ఆమె తన దత్తపుత్రుడు, అతడి భార్యతో కలిసి ఉంటోంది. ఫ్లాట్లను అద్దెకు ఇవ్వడంతో వాటినుంచి అద్దె వస్తున్నా నగరంలోని ఘాట్కోపర్ ప్రాంతంలోని ఒక జైన దేవాలయం దగ్గర బిచ్చమెత్తుకునేది సంజన. అద్దె డబ్బులన్నీ కోడలు తీసుకుని అత్తకు ఒక్క పైసా కూడా ఇచ్చేది కాదు. దాంతో ఆమె గుడి ముందు కూర్చుని యాచించేది. అత్త బంగారు ఆభరణాలు సైతం కోడలి వద్దే ఉన్నాయి.

సోమవారం మధ్యాహ్నం డబ్బుల విషయమైన అత్తా, కోడళ్ల మధ్య గొడవ జరిగింది. కోడలు అంజన అత్త మీద కోపంతో ఊగిపోయింది. పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని ఆమెపై దాడి చేసింది. అయినా మరణించకపోవడంతో ఫోన్ చార్జింగ్ వైరుతో గొంతును బిగించి చంపేసింది. ఉన్న నాలుగు ఫ్లాట్లను తమ పేరు మీద రాయనందునే ఆమెను చంపేశానని పోలీసుల విచారణలో అంజన పేర్కొంది. తల్లి, నానమ్మ గొడవ పడ్డారని మనవరాలు చెప్పడంతో పోలీసులకు క్లూ దొరికింది. అంజనను ఆమె భర్త దినేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Tags

Next Story