కరోనాతో మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఫించను: ఒడిశా ప్రభుత్వం

X
By - TV5 Telugu |18 July 2020 2:09 AM IST
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు కరోనాతో మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు నెలవారి పింఛను చెల్లిస్తామని అన్నారు. ఈ పథకానికి సంబందించిన ఉతర్వులు జారీ చేశారు. కరోనా విధులు నిర్వహిస్తూ.. ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త కరోనాతో మృతి చెందితే.. ఆమె భర్తకు లేదా వారసులకు నెలకు రూ.7,500 పింఛను చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్లు మృతి చెందితే.. వారి భార్య లేదా వారసులకు నెలకు రూ.5,000 చొప్పున పింఛను చెల్లించనున్నట్లు ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com