ఇరాన్లో ఒక్కరోజే కరోనాతో 229 మంది మృతి

X
By - TV5 Telugu |22 July 2020 5:35 AM IST
ఇరాన్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 229 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,634కు చేరిందని ఆర్థిక మంత్రి సిమా సదాత్ లారీ తెలిపారు. దేశవ్యాప్తంగా 278,827 కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com