కరోనా వారియర్స్కు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా

X
By - TV5 Telugu |23 July 2020 11:56 PM IST
కరోనా వారియర్స్ ఎవరైనా కరోనాతో మృతిచెందితే కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనా సోకి మృతి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి సీఎం సంతాపం తెలియజేశారు. తరువాత ప్రభుత్వం ఆకుటుంబానికి అండగా ఉంటుందన్న ఆయన కోటి రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించారు. అమిత్ జీ తన జీవితాన్ని లెక్క చేయకుండా ఢిల్లీ ప్రజల కోసం కరోనాతో పోరాటాం చేశాడని.. ఈ పోరాటంలో తన ప్రాణాలు కోల్పోయాడని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల తరుపున ఆయనకు నివాళిఅర్పిస్తున్నారని అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఆయన కుటుంబానికి కోటిరూపాయల ఆర్థికసాయం అందిస్తామని.. కరోనాపై ఫ్రంట్లైన్లో ఉండి పోరాటం చేస్తున్న వారందరికీ ఎక్స్గ్రేషియో వర్తిస్తుందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

