కరోనా ఉన్నవారు తక్కువగా తింటే మంచిది: బ్రిటన్ మంత్రి

X
By - TV5 Telugu |28 July 2020 12:38 AM IST
కరోనా నుంచి ప్రాణహానిని తగ్గించుకోవాంటే తక్కువగా తినాలని బ్రిటన్ మంత్రి అంటున్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో స్వీయనియంత్రణ ఒక్కటే మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో బ్రిటన్ మంత్రి వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. కరోనా నుంచ ప్రాణహాని తగ్గించుకోవాలి అంటే తక్కువగా తినాలని సూచించారు. ఊబకాయం కరోనా మరణ ముప్పును పెంచుతుందని, కాబట్టి ప్రజలు తక్కువగా తిని బరువు తగ్గించుకోవాలని జూనియర్ ఆరోగ్య మంత్రి హెలెన్ వాటెలీ సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com