కరోనాతో ఓ పెంపుడు శునకం మరణం
By - TV5 Telugu |31 July 2020 2:12 PM GMT
అమెరికాలో కరోనాతో ఓ పెంపుడు శునకం మరణించింది. అమెరికాలో కరోనాతో మరణించిన మొదటి శునకం అదే. జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన పెంపుడు శునకం మరణించిందని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలిపింది. ఈ శునకానికి ఏప్రిలో శ్వాస కోస సమస్య తలెత్తింది. దీంతో దానికి పరీక్షలు చేపించగా.. కరోనా పాటిజివ్ అని తేలింది. ఏడేళ్లు ఉన్న బుడ్డీ అనే ఈ శునకానికి ముక్కు మూసుకుపోవడంతో రక్తపు వాంతులు చేసుకొని మరణించిందని మహోనీస్ చెప్పారు. అమెరికాలో ఇప్పటివరకు చాలా జంతువులు కరోనా బారిన పడ్డాయి. 12 కుక్కలు, 10 పిల్లులు, ఓ పులి, సింహం కరోనా బారిన పడ్డాయని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వివరించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com