ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీపై నారా లోకేష్ ఫైర్

X
By - TV5 Telugu |4 Aug 2020 10:42 PM IST
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మరోసారి సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతికి జగన్ కట్టుబడి ఉన్నారని.. అందుకే రాజధానిలో సొంతిళ్లు కూడా నిర్మించుకున్నారని.. వైసీపీ నేతలు గతంలో చెప్పిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. అప్పట్లో అమరావతికి మద్దతుగా మాట్లాడిన వైసీపీ నేతల వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే, ఇప్పుడు వైసీపీ నేతలంగా మాటమార్చి జే టర్న్ తీసుకున్నారని అన్నారు. మూడు ముక్కలాటలో స్వార్థం లేకపోతే ప్రజాభిప్రాయానికి ఎందుకు భయపడుతున్నారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com