ప్రపంచ వ్యాప్తంగా 7లక్షలు దాటిన కరోనా మరణాలు

X
By - TV5 Telugu |5 Aug 2020 7:05 PM IST
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి బారీగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,87,06,109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 7,04,396 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారంతో కరోనా మరణాల సంఖ్య 7లక్షల మార్క్ దాటింది. గత రెండు వారాల డేటా ఆధారంగా కోవిడ్-19 వల్ల ప్రతి 24 గంటలకు సగటున 5,900 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రతి గంటకు 247 మంది మరణిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి 15 సెకన్లకు ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com