ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మధ్యప్రదేశ్ సీఎం

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా నుంచి కోలుకున్నారు. భూపాల్ లోని చిరాయు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జూలై 25న ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆస్పతిలో చేరారు. 11 రోజులు చికిత్స పొందిన తరువాత కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరో వారం రోజులు సెల్ప్ క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన ఆరోగ్యం బాగుందని తెలిపారు. ఆస్పత్రిలో ఆయన బట్టలు ఆయనే ఉతుక్కున్నారని.. దీంతో ఆయన చేతి నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు.

Tags

Next Story