విజయవాడలో అగ్ని ప్రమాదం.. 7కి చేరిన మృతుల సంఖ్య

విజయవాడలో అగ్ని ప్రమాదం.. 7కి చేరిన మృతుల సంఖ్య

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 7కు పెరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 7కి చేరింది. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కాగా.. రమేష్ ఆస్పత్రి ఆద్వర్యంలో హోటర్ స్వర్ణ పేలస్ లో పెయిడ్ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ముప్పై మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పది మంది ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారు. షార్ట్ సర్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది భయంతో భవనంపై నుంచి దూకేసారు. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. 15మంది రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story