కేరళలో కొండచరియలు విరగిపడిన ఘటనలో 54కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో కొండచరియలు విరగిపడిన ఘటనలో 54కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో వరదలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇడుక్కి జిల్లాలోని రాజమలలో కొండచరియలు విరిగిపడి కొందరు మృతి చెందితే.. మరికొందరు గల్లంతయ్యారు. తాజాగా ఈ ఘటనలో మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రమాదంలో గల్లంతైన మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

కాగా.. ఈ నెల 8న ఇడుక్కి జిల్లాలోని రాజ‌మ‌ల ఏరియాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో ప‌లువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం జరిగనప్పటి నుంచి స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ప్రతీరోజు మృతదేహాలు బయటపడుతున్నాయి.

Tags

Next Story