తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు

X
By - TV5 Telugu |13 Aug 2020 4:35 PM IST
తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంలేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,931 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 86,475కి చేరింది. ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 665కి చేరాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 63,074మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 22,736 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 72.93 శాతంగా నమోదైంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com