ఎన్నికల్లో ఓడిపోయినా.. నిజామాబాద్ను వీడనన్నారు మాజీ ఎంపీ కవిత. గెలుపు ఓటములు సహజమేనని.. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎంపీగా ఓటమిపాలైన తరువాత తొలిసారి నిజామాబాద్లో పర్యటించారామె. మంచిప్పలో ఇటీవల గుండెపోటుతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కిషోర్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు. ఎన్నికల్లో గెలిచిన వారు హామీలు నెరవేర్చాలని కవిత కోరారు.