ముంబైలోని ఓ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తున్న పెట్రోల్ ట్యాంకర్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లో ట్యాంకర్ మొత్తం మంటలు వ్యాపించాయి. డ్రైవర్ క్యాబిన్లో చెలరేగిన మంటలు క్రమంగా ట్యాంకర్ అంతటికీ వ్యాపించడంతో అంధేరి నుంచి గోరెగావ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
ఈ ప్రమాదంతో వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు.. ఘటనా స్ధలాన్నితమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పాట్కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.