ఎన్నికల్లో పరాజయం పొందినంత మాత్రాన కార్యకర్తలు కుంగిపోవద్దని.. మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని. ప్రజల అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై కృషి చేస్తానన్నారామె. ఎన్టీఆర్ జయంతిని సందర్భంగా రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక జేకే గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానితో పాటు ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.