కేంద్రం ప్రవేశపెట్టబోయే నూతన విధ్యావిధానం ముసాయిదాను ప్రజల్లోకి తీసుకురాబోతున్నామన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు దీనిపై చర్చించి సూచనలను ఇవ్వాలని కోరారు. విశాఖలో ఐఐపీఈ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమీ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్త ఆలోచనలు భవిష్యత్కు భరోసా ఇచ్చేలా ఉండాలని..విద్యార్ధులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.