విజయవాడ దుర్గగుడిలో ఉద్యోగి చేతివాటం.. హుండీలో బంగారాన్ని..

Update: 2019-06-04 13:43 GMT

విజయవాడ దుర్గగుడిలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అమ్మవారి ఆలయంలో అతను కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని భార్య కూడా ఆయలంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. అయితే.. హుండీలో బంగారాన్ని చోరీ చేసిన అతను.. చోరీ బంగారాన్ని భార్యకు ఇచ్చి బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. అయితే.. అతను బంగారాన్ని ఇస్తున్న సమయంలోనే గమనించిన ఆలయ అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు. 12 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి భార్యభర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Similar News