డొనాల్డ్ ట్రంప్ తాజా సంచలన స్టేట్ మెంట్ ఏంటో తెలుసా..?

Update: 2019-06-06 11:35 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా సంచలనమే. పర్యావరణ పరరక్షణ విషయంలో ప్రపంచంలోనే అమెరికా మాత్రమే ముందు ఉందన్నారు. వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణలో భారత్, చైనా, రష్యాలు అసలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాలుష్యం, శుభ్రత విషయంలో ఈ దేశాలకు అవగాహన కూడా లేదని నోరుపారేసుకున్నారు. అంతేకాదు ఈదేశాల్లో స్వచ్చమైన గాలీ, నీరు లేదని, భారత్, చైనాలోని నగరాల్లో శుభ్రత గురించి మాట్లాడకపోవడమే మంచిదన్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రిన్స్ చార్లెస్ తో సమావేశమైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పర్యావరణ హితం కోసం ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే.

Similar News